విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ పుట్టపర్తి రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో సోమవారము రజతోత్సవ గురుపూర్ణిమ వేడుకలు (25 సంవత్సరాలు) అత్యంత వైభవంగా శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఆలయంలో ఉదయమే బాబాకు ప్రత్యేక పూజలతో పాటు, విశేష నూతన వస్త్రాల అలంకరణ గావించారు. బాబా అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగడ హారతి అభిషేకం ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు పాద దర్శనం భక్తాదుల కొరకు నిర్వహించారు. అనంతరం పాద దర్శనం తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంతో దాదాపు 20వేల మంది భక్తాదులు అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మంగళవారంతో ముగుస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రముఖ పట్టణ వ్యాపారవేత్త సిద్ధి రాజేష్ సిల్క్స్- రాజేష్ చేతులమీదుగా అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. తదుపరి హాకీ శ్రీ సత్యసాయి జిల్లా వారు 50వేల రూపాయలను అన్నదాన కొరకు విరాళంగా అందజేశారు. ఆలయం భక్తాధులతో కిటకిటలాడింది, బాబాను దర్శించుకోవడానికి క్యూ వరుసలో భక్తాదులు వెళ్లారు. పట్టణ పోలీసులు కూడా తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బాబా గుడి వాలంటీర్స్, గీతా ఫౌండేషన్ వారు, హాకీ క్రీడాకారులు,వాలంటీర్లుగా విధులు నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్య ప్రకాష్, కార్యదర్శి రాంప్రసాద్, కోశాధికారి హేమంత్ కుమార్ తో పాటు సభ్యులు టి సి. నారాయణరెడ్డి, సూర్యనారాయణ, రామలింగయ్య, జీసీ నాయుడు, కె. వీరనారాయణ, మంజు, లీలా, శోభ, భక్తాదులు వేలాదిమంది పాల్గొన్నారు.