విశాలాంధ్ర – శెట్టూరు : మండలం పరిధిలో కైరేవు గ్రామానికి చెందిన హరిజన గోవిందప్ప అనారోగ్యంతో బాధపడుతూ ఆర్డిటి హాస్పిటల్ లో వైద్య చికిత్స చేయించగా మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో 6 నెలల నుండి బత్తలపల్లి ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తిరుగుతున్నారు. అయితే ఈనెల కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉండడంతో ఆసుపత్రికి వెళ్ళడానికి రవాణా ఖర్చులు లేక ఇంట్లోనే ఉంటూ బాధపడుతుండే వారు తన మిత్రులు,కైరేవు గ్రామం లోని యువకులు ఉపాధ్యాయుడు బద్దేనాయక్ గురించి గోవిందప్ప కు తెలియజేయగా మాకొడికి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని కలిసి తన కష్టాన్ని తెలియజేయగా స్పందించిన బద్యే నాయక్ తన వంతుగా రూ.5000/- ఆర్ధిక సహాయం అందజేసి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని తన ఉదారతను చాటుకున్నారు.దీంతో గ్రామస్తులు, ఆ గ్రామం యువకులు ఆయన కు కృతజ్ఞతలు తెలియజేశారు.