కొత్త ఓటర్లను చేర్పించండి
విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ తెదేపా ఇంచార్జీ బి కే పార్థసారథి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశంపార్టీనాయకులతోనియోజకవర్గములో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ రథయాత్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం
నియోజకవర్గములో కొత్త ఓటర్లను గుర్తించి ఓటరు నమోదు చేయించాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్న డూప్లికేట్ మరియు దొంగ ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని, వాటిని
తొలగించేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్లు సిద్ద లింగప్ప, లక్ష్మి రెడ్డి, సిద్దయ్య, పట్టణ కన్వీనర్ రవి శంకర్, చిన్న వెంకట రాముడు, కేశవయ్య, కార్యదర్శి పాలడుగు చంద్రశేఖర్, హుజూర్, ఈశ్వరయ్య, రఘువీర చౌదరి, రామలింగ, జావిద్, కన్నా స్వామి, బోయ అనిల్ కుమార్, జిరాక్స్ సీనా తదితరులు పాల్గొన్నారు.