Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం…..

7 న అగ్రిగోల్డ్ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం…..
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పాల్యం నారాయణస్వామి.

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అగ్రిగోల్డ్ ఏజెంట్లు,బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నారయణ స్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 7 న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995లో ఏర్పడిన అగ్రిగోల్డ్ కంపెనీ ప్రజల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించడం జరిగిందని గుర్తు చేశారు.వ్యవసాయ రంగం,ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిపెట్టి వచ్చిన లాభాల్లో ఏ ఇతర బ్యాంకులు ఇవ్వనటువంటి లాభాలను చెల్లిస్తామని నమ్మబలికి ఖాతా దారులను నిలువునా మోసం చేశారని విరుచుకు పడ్డారు.ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల నుంచి డిపాజిట్లు సేకరించడం జరిగిందన్నారు. 2015 నాటికి అగ్రిగోల్డ్ సంస్థ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించి దివాలా తీసిందని ఏకరువు పెట్టారు.దీంతో లక్షలాదిమంది వినియోగదారులు ఏజెంట్లు ఆయా అగ్రిగోల్డ్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న అప్పటి ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారాన్ని సిబిసిఐడికి అప్పగించిందని దీంతో విచారణ మొదలుపెట్టారన్నారు.అయితే అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను జప్తు చేసేందుకు చట్టపరిధిలో ఆలస్యం జరిగిందన్నారు.అగ్రిగోల్డ్ బాధితుల పట్ల గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే వారికి అన్యాయం జరిగిందని మండిపడ్డారు.అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అధికారంలో కి వచ్చిన ఆరు నెలలకే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఈ నేపధ్యంలో అగ్రిగోల్డ్ బాధితులు జగన్ మాటలు నమ్మి వైకాపా విజయానికి తోడ్పాటును అందించారని గుర్తు చేశారు.20 వేల వరకు డిపాజిట్ చేసిన వారికి నిర్దిష్ట కాలంలో చెల్లిస్తామని చెప్పడం జరిగిందని అయితే పూర్తి స్థాయిలో అమలు జరిగిన దాఖలాలు లేవన్నారు.సిబిఐ విచారణలో భాగంగా కోర్టుల్లోనూ ,గ్రామ సచివాలయాల్లో బాండ్లను సమర్పించాలన్నారు.1180 కోట్లు చెల్లిస్తే పూర్తవుతుందని పేర్కొన్నారని ఇప్పటివరకు కేవలం 9 వందల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ప్రభుత్వం నుండి 3 వందల కోట్ల రూపాయల స్పష్టత రాలేదని అసహనం వ్యక్తం చేశారు.ఈ విషయం పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆగస్టు 15 లోపు సీఎం జగన్ తన హామీని నెరవేర్చని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బాదితులందరూ అమరావతి రాజధానికి చేరుకొని ఎపి అసెంబ్లీ సహా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.అందులో భాగంగానే ఈ నెల 7 న అగ్రిగోల్డ్ ఏజెంట్లు, వినియోగదారుల సమస్యలపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు.ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ అండ్ వినియోగదారుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్దేశ్వర్,జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయప్ప,మహిళా కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img