Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దళితులపై దాడులు ఆపకపోతే ప్రతి దాడులు తప్పవు

విశాలాంధ్ర-రాప్తాడు : నేటి ఆధునిక సమాజంలో మనుషుల్లో విపరీత ధోరణి పెరిగిందని నేపథ్యంలో కులాల కుంపటి నానాటికి పెరుగుతోంది తప్ప తరగడం లేదని ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు నిరసనగా శుక్రవారం రాప్తాడు మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సర్కిల్ లో ప్రధాన రహదారిపై కూర్చోని నినాదాలు చేశారు. అక్కడ నుండి ర్యాలీగా బయలు దేరి తహశీల్దార్ కార్యాలయం చేరుకొని ధర్నా చేపట్టి సమస్యల వినతి పత్రం తహశీల్దార్ లక్ష్మి నరసింహకు సమర్పించారు. ధర్నాకు స్వతంత్ర కుమారి అధ్యక్షత వహించగా ఎమ్మార్పీఎస్ విహెచ్ పీఎస్, ఎంఎంఎస్, ఎంఎస్పీ, తదితర కుల సంఘాల నాయకులు ఓ.నల్లప్ప, కేపి నారాయణస్వామి,.హరగోపాల్, ఓ.పెద్దన్న, కదిరప్ప, చిన్న ఆంజనేయులు,.మరూరు చిన్నా, బికేఎస్ ఆనంద్, పరమేష్, నిస్సార్ అహమ్మద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళితులను అనేక చోట్ల ఆకారణంగా చావబాదారని వాపోయారు. అయ్యవారిపల్లి గ్రామంలో దళిత కుమార్ పై కురుబ ఎర్రిస్వామి వేట కొడవలితో దారుణంగా నరికాడని.. కుమార్ చావు బతుకుల మధ్య బెంగుళూరులో చికిత్స పొందుతున్నాడన్నారు. కుల వివక్షతలో భాగంగానే బరితెగించి దాడులకు పాల్పడ్డారని వీరిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం నేరమనే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాయకులు రంగాపురం పుల్లప్ప, రేకులకుంట రామాంజనేయులు, బానాశి శీనా, రాజు, శాంతమ్మ, లక్ష్మక్కతోపాటు దాడులకు గురైన బాధిత కుటుంబాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img