విశాలాంధ్ర ధర్మవరం:: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఈ నెల 24వ తేదీన గచ్చిబౌలి స్టేడియం నందు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలోని మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య బృందం యొక్క కూచిపూడి నృత్య వైభవం అందరినీ ఆకట్టుకుంది. ఈ అద్భుత గిన్నిస్ వరల్డ్ రికార్డులో ధర్మవరం విద్యార్థులు పాల్గొడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో గురువు మానసతోపాటు శిష్య బృందం సోమశేఖర్, జాహ్నవి, యశస్విని, హేమశ్రీ చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. తదుపరి మానస మాట్లాడుతూ ఇటువంటి వేడుకల్లో తమ నృత్యా కార్యక్రమాన్ని ప్రదర్శించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ధర్మవరం చిన్నారులు ప్రదర్శించిన నాట్యం అందరినీ ముగ్ధుల్ని చేసింది. ఈ వేడుకల్లో వందలాదిమంది నృత్య కళాకారులు పాల్గొన్నారు