విశాలాంధ్ర – వలేటివారిపాలెం : మండలంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిదేవస్థానంను దర్చించుకొనుటకు రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులుఅధిక సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కలు తీర్చుకొన్నారు.దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఈ రోజు భక్తులద్వారావివిధ రూపాలలో దేవస్థానంనకు వచ్చిన ఆదాయం.9,22,085రూ
పాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయకార్యనిర్వాహనాదికారి కె.బి శ్రీనివాసరావు తెలిపారు. అష్టోత్రం ద్వారా 8,900 రూపాయలు, కుంకుమార్చన ద్వారా 21,080రూ, తలనీలాలద్వారా రూ41,350 రూ,వాహన పూజలద్వారా5,700 రూ,ప్రత్యేక దర్శనం ద్వారా 2,21,900రూపాయలు, స్థల పురాణం ద్వారా 1,140రూ, రూము అద్దెలు ద్వారా 28,170రూ,కవర్లు ద్వారా6,900 రూపాయలు, లడ్డూ ప్రసాదం ద్వారా1,99, 165 రూపాయలు ,అన్న ప్రసాదముద్వారా 3,81,464 రూపాయలు,ఇతర విరాళాలు6,316 రూపాయలు మొత్తం 9,22,085 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కె. బి శ్రీనివాసరావు తెలిపారు.అదేవిదంగా శనివారం మాలకొండ దేవస్థానం సన్నిధిలో కందుకూరు మండలం విక్కీరాల పేట గ్రామానికి చెందిన మహిళలు కోలాటం ఆడి భక్తులను సంతోష పెట్టారు.