ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలి
: జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను మరియు ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట బందోబస్తు నిత్యం కొనసాగాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈనెల 12వ తేదీ నుంచి చేపట్టే ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ కోసం పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, తహశీల్దార్ శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.