రాష్ట్రంలో మహిళలు బాలికలు మిస్ అవుతుంటే సీఎం జగన్ మొద్దు నిద్ర వహిస్తున్నాడా…..?
ప్రతిపక్షాలు,వామపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ ఆడబిడ్డల రక్షణ పై లేదా…..?
రాష్ట్రంలో తప్పిపోయిన మహిళల బాలికల ఆచూకీ కనిపెట్టండి….?
ప్రతి ఇంటికి నిగాపెట్టిన వాలింటర్ వ్యవస్థ మహిళలు,బాలికలపై ఏమి నిఘా పెట్టారు….?
వాలింటర్ల చేతిలో రాష్ట్ర ప్రజల డేటా పెట్టడం వెనుక ఏముంది….?
జగన్ ప్రభుత్వంలో వాలింటర్ల పాత్ర ఏంటి…?
వాలంటీర్ల వ్యవస్థతో వైసీపీ దొంగ ఓట్ల తో గెలవడానికి దొడ్డి దారి…?
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్……
విశాలాంధ్ర-గుంతకల్లు : జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకపోయిందని గత రెండు సంవత్సరాలలో 30,196 వేల మంది మహిళలు, బాలికలు కనిపించకుండా పోయారని దీనికి పూర్తి బాధ్యత సీఎం జగన్ మోహన్ రెడ్డి దేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ ఆరోపించారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో 30 వేల 196 మంది మహిళలు,బాలికలు మిస్ అయ్యారని కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా పార్లమెంట్లో తెలిపారన్నారు. మహిళలు బాలికలు కనిపించకుండా పోయారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలదించుకోవాలన్నారు.దీనికి పూర్తి బాధ్యత జగన్ ప్రభుత్వామే బాద్యత వహించాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రాలోనే కొన్ని వేల మంది బాలికలు, మహిళలు మిస్ అవుతున్నారంటే జగన్ ప్రభుత్వం మొద్దు నిద్ర చేస్తుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలింటర్ ల వ్యవస్థ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ప్రతి వాలింటర్ కి 50 కుటుంబాలు బాధ్యత ఇచ్చారని అయితే వాలింటర్లకు ఈ మహిళల మిస్సింగ్ ల విషయం తెలిసింటుందన్నారు.జగన్ కూడా ఏ రోజు కూడా కనిపించకుండ పోయిన మహిళలు బాలికల విషయంపై స్పందించిన పాపాన పోలేదన్నారు. పార్లమెంట్లో చర్చించినా కూడా ఆచరణలో చర్యలు లేకపోయిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తిస్థాయిలో అపహరణకు గురైన మహిళలను బాలికలను గుర్తించాలని కోరారు. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచాలని హైకోర్టు 2017 సంవత్సరంలోనే తీర్పునిచ్చిందన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబ వ్యక్తిగత విషయాలు సేకరించి యాప్ లో ఉంచడం తీవ్రమైన నేరమని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకి బంగం కలిగిస్తున్నారని అన్నారు. ప్రజల యొక్క వ్యక్తిగత విషయాలని వెల్లడించడానికి ప్రభుత్వానికి హక్కు లేదని ప్రశ్నించారు.న్యాయస్థానం కేసును సుమోటోగా తీసుకుని విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యొక్క వ్యక్తిగత సమాచారంతోనే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఏర్పాటు చేసుకుని ప్రతిపక్షాల ఓట్లను తొలగించి వైసిపి దొడ్డిదారిన గెలవాలని చూస్తుందని ఇది చాలా విచారకరం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. వైయస్సార్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పెట్టి అవినీతి రాష్ట్రంగా మార్చిందన్నారు.ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నికలలో ఓడించేందుకు టిడిపి చంద్రబాబు నాయుడు బిజెపి వైయస్సార్ పార్టీలకు వ్యతిరేకమైన కూటమిని ఏర్పాటుచేసి కలిసి వచ్చే పార్టీలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు తక్షణ చర్యలు అవాస్యమన్నారు.. చంద్రబాబు చొరవ తీసుకొని జాతీయస్థాయిలో ఇండియా కూటమి తరహాలో ఆంధ్రాలో కూడా బిజెపి వైయస్సార్ పార్టీలకు వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీల తో సేవ్ ఆంధ్ర ప్రదేశ్ కూటమిని చంద్రబాబు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని టిడిపి చంద్రబాబుకి జగదీష్ సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి ,సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బి.మహేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు.