విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణ కేంద్రం లోని తెదేపా కార్యాలయం నందు సవితమ్మ పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో టమోటా, పచ్చిమిర్చి, ఇతర నిత్యావసర ధరలు రోజురోజుకీ విపరీతంగాపెరిగిపోతున్నాయని సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారని వెంటనే రైతు బజార్ల ద్వారా అతి తక్కువ రేటుకే నిత్యవసరకులు సామాన్య ప్రజలకు అందేలా చూడాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఉరవకొండలో శాంతియుతంగా రైతులు బీమా అడిగితే రైతులను నేరస్థులుగా చూసి అక్రమ కేసులు పెట్టడం దారుణంరైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలంటూ కేసులు ఎత్తేయకుంటే రైతులతో కలసి జైలు భరోసా నిర్వహిస్తామని అదేవిధంగా నష్ట పోయిన రైతులందరికీనష్టపరిహారం,ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆమెతో పాటుగా మాధవ నాయుడు రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు శ్రీరాములు,సూర్యనారాయణ,త్రివేంద్ర నాయుడు కౌన్సిలర్ గీతాహనుమంతు బాలాజీ నాయక్,,పోతన్న రాజేష్ ,మంజు ,,సురేష్ తదితరులు పాల్గొన్నారు.