Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజల సమస్యలను తీర్చేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం.. సర్పంచ్ సురేష్ రెడ్డి

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రజల సమస్యలను తీర్చేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రేగాటిపల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రేగాటి పల్లిలో సురేష్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడు రోజుల నుండి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 11 రకాల సర్వీసులు గూర్చి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. తదుపరి ప్రజల ద్వారా అర్జీలు తీసుకొని నేడు ఉచితంగా ప్రత్యేక అధికారి చాంద్ బాషా, జిల్లా పంచాయతీ అధికారి విజయకుమార్, విస్తరణ అధికారి మమతా దేవి, సర్పంచ్ సురేష్ రెడ్డిల ద్వారా సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 412 సర్వీస్ లను పూర్తి చేయడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నాడని, ఇందుకు గ్రామీణ ప్రజలు కూడా మద్దతు పలకడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సువర్ణ, మురళి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img