విశాలాంధ్ర – పామిడి అనంతపురం : నిజo గెలవాలి కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం ఉదయం అనంతపురం జిల్లా పామిడి పట్టణ లో చేరుకున్న తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కు తెదేపా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు, ఘనస్వాగం పలికారు.చంద్రబాబు పాలనలో ఎలా ఉంది.అనంతరం ఆమె మాట్లాడారు ఈ ఐదేళ్ల అరాచక పాలన ఎలా ఉందో మీకందరికీ తెలుసునని. ఓటుతో కురుక్షేత్రాన్ని ఎదుర్కొందామని అందుకు మనమందరం యుద్ధానికి సైయ్యా.. సైయ్యా. అంటూ భువనేశ్వరి తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపారు.అక్కడ నుంచి గుత్తి కి వెళ్లారు,ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, పవన్ గౌడ్, తేజ గౌడ్, ఎం.హెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గౌస్ ఫిరా, పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్డే శివ, టీడీపి సీనియర్ నాయకులు రంగస్వామి యాదవ్, మండ్ల శ్రీనివాసులు, ఇప్పి నరసింహలు, రామాంజనేయులు,తదితరులు పాల్గొన్నారు..