Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దేశంకోసం పునరంకితమవుదాం

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : నాభూమి-నాదేశం కార్యక్రమంలో భాగంగా దేశంకోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని దేశంకోసం పునరంకితమవుదామని సర్పంచ్ లు పిలుపునిచ్చారు.
శుక్రవారం మండలంలోని చుండి,ఉప్పలపాడు,పోకూరు,కళవల్ల,నూకవరం గ్రామాలలోని సచివాలయ ఆవరణలో మనమట్టి-మనదేశం కార్యక్రమం కింద మట్టికి నమస్సులు-వీరులకు వందనం శిలాఫలకాన్ని సర్పంచ్ లు ఇరుపని సతీష్,వింజం వెంకటేశ్వర్లు,పర్రె కనకరత్నం,దుగ్గిరాల రాఘవ,ఎంపీడీఓ రఫిక్ అహ్మద్, స్ధానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సచివాలయసిబ్బంది,నాయకులు అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత ఏడాది హర్ గర్ తిరంగా కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేశామన్నారు.అమృత్ సరోవర్ తో గ్రామాల్లో చెరువుగట్ల అభివృద్ది మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు.ఈ ఏడాది నాభూమి-నాదేశం పేరిట ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమాలను అన్ని గ్రామ పంచాయితీలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు స్వాతంత్ర్య దేశంలో ఎందరో మహనీయుల త్యాగఫలాలను మనం అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరిలో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు నామట్టి-నాదేశం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. భారతదేశంలో జన్మించడం మన అదృష్టమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,ఎంపీటీసీ చౌడబోయిన యానాది,నాయకులు ఇరుపని అంజయ్య,పర్రె జగదీష్,అత్తోట చెన్నయ్య,లింగాబత్తిన మాల్యాద్రి స్వర్ణ మాలకొండయ్య, పంచాయతీ కార్యదర్శులు,సచివాలయ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img