విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : విద్య వ్యతిరేక విధానాలను ఐక్యతగా నిర్మూలిద్దామని జిల్లా అధ్యక్షుడు కుళాయి స్వామి, కార్యదర్శి చిరంజీవిలో పేర్కొన్నారు. మంగళవారం మంత్రాలయంలో ఏఎస్ఎఫ్ రాయలసీమ జిల్లాల విద్య వైజ్ఞానిక రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో బోధన సిబ్బంది లేక విద్యార్థులు జీవితాలు అఘాతంలో పడుతూ ఉన్నాయన్నారు. నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేస్తూ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఖాళీగా ఉంచుతూ ప్రతిభావంతులకు అవకాశాల కల్పన లేకుండా నిరుద్యోగులుగా ఉండిపోతు ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యపు విధానాలతో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పోరాటాలకు సంసిద్ధం కావాలన్నారు. అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నెలకొల్పిన నిధులు విడుదల చేసేంతవరకు ఉద్యమాల కార్యచరణ చేపట్టేలా ప్రణాళికలను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతు యాదవ్, కార్యవర్గ సభ్యుడు అంజి, ఉమేష్ ,మహేష్, వేణుగోపాల్ చిరంజీవి, నరసింహ యాదవ్, రజిని ఆనంద్, వంశీ ,జిల్లా కౌన్సిల్ సభ్యులు అఖిల్, వెన్నెల, లిఖిత, సాయి రాజేశ్వర్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.