విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం ఏవో రమణ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిలాల్ నాయక్ వినతి పత్రాన్ని సమర్పించారు.వినుకొండ పరిసర ప్రాంతాలలో నిర్దాక్షిణ్యంగా చట్టాలను లెక్కచేయకుండాప్రాణాన్ని నిలబెట్టేచెట్లు నరికివేత వాటిని అరికట్టు విషయం. అటవీ అధికారులు,ప్రజలు మారాలి. పెనుకొండ పరిసర ప్రాంతాలలోని మునిమడుగు గ్రామంలో చింత చెట్టు కానుగ చెట్టు మరికొన్ని చెట్లు నరికేశారని సమాచారం అందింది ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజలు చెట్లు నరుకుతూ ఉన్నారు. వారికి భయంగాని అవగాహన గాని కల్పించడంలో సంబంధిత అధికారులు విఫలం చెందారని భావించవచ్చు చింత చెట్టు విలువ ఎంత.. ఆ ప్రకారం కఠినంగా పెనాల్టీలు విధిస్తే మరొకరు చెట్లు నరకడానికి భయపడతారు కానీ సంబంధిత అధికారులు ఆ దిశలో ఆలోచన చేయడం లేదు అందువలన పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతోంది ఇష్టానుసారం ప్రజలు వ్యాపారస్తులు భయం లేకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తూ నష్టం కలిగిస్తున్నారు ఇది ఎంతో బాధాకరమైన విషయం. ప్రాణవాయువు నీరు ఆహారం నీడ కలిగించే విశిష్టమైన జీవనాధారమైన చెట్లను భయం లేకుండా నరికేస్తున్న వారికి భయం కల్పించే లాగా వెంటనే తగు విధమైన చర్యలు చేపట్టి చెట్లు నరికిన వారితో పాటు యంత్రాలు యంత్రాల యొక్క యజమానులను సైతం పిలిపించి కేసులు రాసి పెనాల్టీలు విధించమని కోరుతున్నాను. ఇది ఎంతో భయానకమైన దారుణమైన సంఘటనగా భావిస్తున్నాను. కావున ప్రకృతిని కాపాడడానికి చట్టాలు కూడా ఉపయోగపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ నేచర్ ఆర్గనైజేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రంజిత్ నాయక్ సౌత్ ఇండియా కౌన్సిల్ నెంబర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.