జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : దేశంలో జనాభా పెరుగుదల వలన అనేక సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. యుగంధర్ పేర్కొన్నారు. ప్రపంచ జన దినోత్సవం సందర్భంగా సోమవారం యుగంధర్ తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల పర్యావరణ పరిరక్షణకు, మానవాళి మనుగడకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. ముఖ్యంగా భూమి, పర్యావరణంపై అదనపు ఒత్తిడి కలుగుతుందన్నారు.అలాగే పేదరికం ,పర్యావరణం, వనరుల క్షీణత సామాజిక అసమానతలకు తావిస్తుందన్నారు..కాబట్టి జనాభా నియంత్రణకు అనేక పద్ధతులు పాటించాలని కోరారు.ప్రజలు జనాభా పెరుగుదల వల్ల ఏర్పడు ఇబ్బందులు అర్థం చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా ప్రజల అవగాహనకు గోడపత్రికలను అయన విడుదల చేసారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు సుజాత, చెన్నకేశవులు, మనోజ్, డెమో ఉమాపతి, గంగాధర్,మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.