Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చిరస్మరణీయులు డా. బాబు జగ్జీవన్ రామ్

: జిల్లా కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా. బాబు జగ్జీవన్ రామ్ చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన డా. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘన నివాళులు అర్పించారు. డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి బాబు జగ్జీవన్ రామ్ మహోన్నతమైన సేవ చేశారన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబు జగ్జీవన్ రామ్ 1908 మార్చి 5న జన్మించి, 1986 జులై 6న మరణించారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర కేబినెట్ మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి ఎంతో సేవ చేశారని, నవభారత నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం చేస్తే ఆయనకి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పని చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ పాటించి బాగా చదవాలని, దేశానికి నేను ఎం ఇవ్వగలను అనే దృష్టితో చదవాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్ షెడ్యూల్ కులాల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తి స్థాయిలో అందేవిధంగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ డా. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. వెనుకబడిన నిమ్న వర్గాలకు అనేక పథకాలు అమలు చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేసి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. విలువలతో కూడిన బాబు జగ్జీవన్ రామ్ జీవితం మనందరికీ ఆదర్శప్రాయం అన్నారు. మహోన్నత విలువలతో కూడిన ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.*ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, రావు, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ఎస్డిసి ఆనంద్, డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, ఐ.అండ్.పిఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, ఈఆర్ఓ శిరీష, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయ్ డిఎం రమేష్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img