విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని శెట్టిపల్లి తండా నందు శుక్రవారం మండల స్థాయి అధికారులు మండల అప్పర్ ప్రైమరీ పాఠశాల నందు నా దేశం నా భూమి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశం యొక్క విలువ తెలియజేయడం మానవతా విలువలు మరియు చెట్లు పెంపకం వాటి విలువలు గురించి అధికారులు తెలియజేశారు మొదటగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి మొక్కలు పెంపకం వలన మానవ మనుగడకు ఆరోగ్యపరంగా మంచి వాతావరణాన్ని సృష్టిస్తాయని వాటిని మొక్కలు నాటడం పెంచి పెద్ద చేయడం వలన భావి భవిష్యత్ భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివ శంకరప్ప ,ఎంఈఓ చంద్రశేఖర్, సుధాకర్, సర్పంచ్ శ్యామల, ఎంపిటిసి , ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.