విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ట్రాన్సిట్ క్యాంపస్-IIలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి, డీన్ ఇన్చార్జి ఆచార్య సి. షీలా రెడ్డి సహకారంతో జరిగిన కార్యక్రమం విద్యార్థినీ విద్యార్థులకు చక్కటి దిశానిర్దేశం చేశారు . ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్. ఇ. సందీప్ మాట్లాడుతూ… నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం గురించి, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చేసిన కృషి మరియు 1897లో ఆయన పుట్టినప్పటి నుండి ఆయన చేసిన పరాక్రమాలపై చక్కటి అవగాహనను కల్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ మరియు ఇతర ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలు మరియు సహకారాన్ని కూడా డా. సందీప్ వివరించారు. మేఘా జోషి, ఆకర్ష్ ఉజ్వల్, రాజు కుమార్ & రోషన్ పాండేలతో సహా కొంతమంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు నేతాజీ గురించి వివరంగా తెలియజేశారు. కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ దీపాంకర్ డే, (ఎన్ ఎస్ ఎస్ యూనిట్ II, ప్రోగ్రాం ఆఫీసర్) మరియు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ గరికిపాటి గురజాడ నిర్వహించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ చదువుల సృజన వ్యవహరించారు. శరణ్ వందన సమర్పణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది వాలంటీర్లు మరియు 15 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.