విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : రాష్ట్ర ఎన్ హెచ్ ఏం జేఏసీ కార్యాచరణలో భాగంగా అనంతపురం జిల్లా లోని ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్ సంపూర్ణ మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్, శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న అన్ని స్థాయిలలో ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం , మినిమం టైం స్కేలు కోసం డిమాండ్ చేశారు. జీవో 64 ను రద్దు చేసి నవంబర్ 2022 నుంచి జీవో 60 ప్రకారం ఎర్రియర్స్ ఇవ్వాలి.హెచ్ ఆర్ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అమలు చేయాలి ఎన్ హెచ్ ఎం హెచ్ ఆర్ సెల్ గ్రీవెన్స్ కమిటీ లు ఏర్పాటు చేయాలి.పరస్పర ఒప్పంద బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమములో NHM ఉద్యోగులు జయ, శ్రీనివాసులు, సత్తి, మని, ఖాదర్, రషీద్, సుమంత్, తులసి, రామాంజినమ్మ, జ్యోతి,మహమ్మది, ప్రభావతమ్మ, సరిత, జానకి,గీత,రేవతి,మౌలిక, తేజేశ్విని, శైలజ, షాను, మెరియుం, జ్యోతి, బిందు, లీలావతి, కొండమ్మ, తిరుమల, అరుణ, రామలింగ, సుమన్, ల క్ష్మి తదితర ఎన్ హెచ్ ఏం ఉద్యోగులు పాల్గొన్నారు.