రాప్తాడు : మాజీ మంత్రి, పేదల పెన్నిధి దివంగత నేత పరిటాల రవీంద్ర ఆశయాలతో ముందడుగు వేస్తామని రాప్తాడు టీడీపీ నాయకులు అన్నారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని పరిటాల రవీంద్ర సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. మరోసారి రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాలని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా ప్రజలను చైతన్యం చేసి ఓటు రూపంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామన్నారు. అనంతరం పరిటాల సునీత, పరిటాల శ్రీరారాంలను కలిశారు. కార్యక్రమంలో మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ, కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, రాష్ట్ర కార్యదర్శి ఎర్రగుంట నారాయణస్వామి, మరూరు గోపాల్, మాజీ కన్వీనర్ సాకే నారాయణస్వామి, పంపు ఇంద్ర, గంగలకుంట రమణ, కిష్ట, ఎంపీటీసీ జాఫర్, సర్పంచులు మిడతల శీనయ్య,
సాకే తిరుపాల్, ఉజ్జినప్ప, రైతు సంఘం బోయ గోపాల్, రామనేపల్లి శీనా, రామకృష్ణ, గేట్ సత్తి, లక్ష్మన్న, రాజలింగం, అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.