విశాలాంధ్ర-రాప్తాడు : ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 2023-24 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు రేపు అనంతపురం నగరం రుద్రంపేట బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న వాల్మీకి కళ్యాణ మండపంలో ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నామని వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ సీ అక్కులప్ప, ప్రధాన కార్యదర్శి ఎ. చైతన్య కుమార్, కోశాధికారి జి.పవన్ కుమార్ లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన, నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పంపిన విద్యార్థినీ, విద్యార్థులకు ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందజేశామన్నారు. మరిన్ని వివరాలకు 94407 74519, 8309090406 నంబర్లను సంప్రదించాలన్నారు.