విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 9, 10 వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ వార్డు సభ్యులు ఎం రామాంజనేయులు,రవి శనివారం ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డ్ సభ్యులు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో వార్డు సభ్యులుగా ప్రజలు గెలిపించారని వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని తాము ప్రతిపాదించిన పనులన్నింటినీ కూడా మా వార్డుల్లో అభివృద్ధి చేయాలని వారు పేర్కొన్నారు. పంచాయతీ సాధారణ సమావేశంలో ప్రతిపాదించిన పనులకు ఆమోదం తెలిపి వేగవంతంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రధానంగా తమ వార్డులలో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, సిసి రోడ్లు విద్యుత్ దీపాలు తొపాటు అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు.