విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : జె.యన్.టి.యూ అనంతపురం విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న పలువురు బోధ నేతర సిబ్బందికి పదోన్నతి కల్పిస్తు ఉపకులపతి ఆచార్య జి. రంగ జనార్ధన ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య యస్.వి.సత్య నారాయణ శనివారం ఉత్తర్వులు జారిచేశారు. వీసి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో సమర్థవంతంగా నిర్వహించి.. కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ , కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య అరుణ కాంతి , డి ఆర్ దుర్గా ప్రసాద్ , ఏ ఆర్ నూర్ మహమ్మద్ , శంకర్ రెడ్డి , శ్రీ రమేష్ , శ్రీ సునీల్ భోధనేతర సంఘం సభ్యులు ప్రెసిడెంట్ యస్. శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ కె.సుదర్శన్, సెక్రటరీ యస్. నాగప్ప, జాయింట్ సెక్రటరీ వి. రాజేష్ బాబు, ట్రెజరర్ టి. అబ్దుల్ రజాక్, కరస్పాండెంటు యం. ఓబిలేసు, స్పోర్ట్స్ సెక్రటరీ ఎ. పరుశురాముడు పదోన్నతి పొందిన వారిని అభినందించారు.