జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకంగా అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. సప్లమెంటరీ బ్యాలెట్ యూనిట్ లకు సంబంధించి 2,350 బ్యాలెట్ యూనిట్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమీషన్ ఈవీఎంలు, వివిప్యాట్స్ ల ర్యాండమైజేషన్ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఈఎంఎస్2.0 సాఫ్ట్ వేర్ లో ఆన్ లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను ను చేపట్టామని తెలిపారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, నోడల్ అధికారి నరసింహారావు, స్టాండింగ్ కమిటీ మెంబర్లైన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి పవన్ కుమార్, ఆప్ ప్రతినిధి మసూద్ వలీ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎస్.ఇమామ్ వలీ, బహుజన సమాజ్ పార్టీ నుంచి హేమ సుందర రాజు, సమాజ్వాది పార్టీ షేక్ నిజాం, స్వతంత్ర అభ్యర్థులు చౌడేశ్వరి, కేతిరెడ్డి రఘునాథరెడ్డి, రమణారెడ్డి, బీఎస్పీ ప్రతినిధి దుర్గేష్, బిజెపి ప్రతినిధి శ్యాంసుందర్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.