మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల రంగా థియేటర్ నుంచి ఒక కిలోమీటర్ వరకు ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పోలీసుల సమక్షంలో తొలగింపు కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వర్షాకాలం వస్తే కాలువల పైన మెటికల అరుగు కట్టి, అనవసరంగా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందనీ ,ప్రస్తుతం ధర్మవరం జనాభా పెరిగింది, ఇందుకు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పోలీసుల సమక్షంలో మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించిన వాటిని వేసిన కొలతల ప్రకారం జెసిబి తో తొలగించి, అప్పటికప్పుడే ట్రాక్టర్లతో ఆ మట్టిని తరలించడం జరిగిందన్నారు. ఈ తొలగింపు కార్యక్రమం దాదాపు మూడు గంటల పాటు జరిగిందని, దగ్గరుండి తాను పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఎటువంటి ఆటంకాలు, గొడవలు జరగకుండా పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ దుకాణదారులకు పలుమార్లు సూచనలు ఇచ్చిన నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఆక్రమణ స్థలములో కాలువలు పూర్తిగా మూసి వేయడంతో వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలోని మురికి నీరు రోడ్లపైకి చేరుతుందని, ఇందుకు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సచివాలయాలలో, మున్సిపల్ కార్యాలయమునకు ఫిర్యాదులు అందడంతో ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు మహబూబ్ బాషా, స్యంసన్, కేశవ, మేస్త్రీలు నాగరాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.