Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యువ గళం పాదయాత్ర కు సంఘీభావ ర్యాలీ, విజయవంతం.. టిడిపి నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం : యువ గళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, పట్టణంలో తెలుగుదేశం పార్టీ భారీ సంఘీభావ ర్యాలీ విజయవంతమైనట్లు రాష్ట్ర కార్యదర్శులు కమతం కాటమయ్య, గోనుగుంట్ల విజయ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 4 మండలాలలో గల టిడిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల నాయకులు దాదాపు 3 వేల మందికి పైగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువ గళం పాదయాత్ర ద్వారా చరిత్ర సృష్టించబోతున్న నారా లోకేష్ అని తెలిపారు. టిడిపి చేపట్టే కార్యక్రమాన్ని ఓర్వలేక వైయస్సార్సీపి ఉక్కిరిబిక్కిరి అవుతోందని తెలిపారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం ద్వారా చరిత్రలో నారా లోకేష్ నిలిచిపోయారని తెలిపారు. పట్టణమంతా పసుపు మయంగా మారిపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, ఆటవిక, విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నడుము కట్టారని తెలిపారు. అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఇవ్వగలం పాదయాత్రకు జననీరాజనం పలుకుతుండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వైయస్సార్సీపీ నాలుగేళ్ల పాలనలో నిత్యావసర ధరలు పెరగడం, బస్సుచార్జీలు బాదుడు, విద్యుత్ అధిక చార్జీలతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. నిద్రపోతున్న వైసీపీ ప్రభుత్వ కన్నులను తెరిపించడానికి ఈ ఇవ్వగలం పాదయాత్రను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు, రూరల్ అధ్యక్షుడు లక్ష్మన్న, బత్తలపల్లి అధ్యక్షులు గోనుగుంట్ల నారాయణరెడ్డి, తాడిమర్రి అధ్యక్షుడు కూచి రాము, చింతపులుసు పెద్దన్న, కాచర్ల కంచన్న , పరిసే సుధాకర్, చట్టా లక్ష్మీనారాయణ, నాగూర్ హుస్సేన్, క్లస్టర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహేష్, మారుతి స్వామి, అంబటి సనత్, నియోజకవర్గ అధ్యక్షురాలు బిబి, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాహెబ్బి, పట్టణ అధ్యక్షురాలు స్వర్ణకుమారి, వేలాదిమంది టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img