Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మహిళలు, పిల్లల నేరాలపై సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేకశ్రద్ధ


జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
విశాలాంధ్ర – పార్వతీపురం: రాష్ట్ర డిజిపి ఉత్తర్వులు మేరకు కన్విక్సన్ బేస్డ్ పోలీసింగ్ విదానంలో బాగంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలకు సంబంధించి సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ప్రాదాన్యత కలిగిన కేసులను డి.ఎస్పీస్థాయి అధికారులకు-5, సిఐస్థాయి అధికారులకు-5, ఎస్ఐ స్థాయి అధికారులకు-10 కేసులచొప్పున ఇచ్చి తక్కువ సమయంలోట్రయిల్ నిర్వహించేల తగు సత్వరన్యాయం కోసం కృషిచేస్తున్నట్లు తెలిపారు. మన్యం జిల్లాలో క్రైమ్ నెంబర్లు 185/2022, 186/2022 లలో కేసులలో ముద్దాయి అయిన రొంపల్లి రామకృష్ణ తండ్రి లేటు సత్యనారాయణ కేసులను పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఏ. సుబాష్, ట్రయల్ పర్యవేక్షణ అధికారి ఎస్ ఆర్ హర్షిత(దిశ సెల్,డిఎస్పీ)కృషితో, పోక్సో పిపీ మావూరి.శంకరరావు పిర్యాదు తరుపున వాదించగా ముద్దాయిమీద నేరం రుజువు కాబడినట్లు విజయనగరం పోక్సో కోర్టుతీర్పును జిల్లాజడ్జి షేక్ సికిందర్ భాషా వెల్లడించారని తెలిపారు.ఒక్కోక్క కేసులో ముద్దాయికి 20 సంవత్సరాలు కఠిన కారాగార జైలుశిక్ష, 10వేలు జరిమానావిదించారన్నారు. రెండు కేసులలో ముద్దాయి ఒకడే అయిన, బాధితులు ఇద్దరు కనుక,ఒక్కొక్క బాదితురాలకి 4 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని ఆదేశాలు జారీచేశారని తెలిపారు.అప్పట్లో నమోదయిన కేసు వివరాలను కూడా ఎస్పీ తెలియజేసారు.14జూలై2022న రాత్రి 8గంటలకు కొత్తవలసలోని నందమూరి కోలనికి చెందిన బాధితురాలు-1, పార్వతీపురం పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేసిందన్నారు. తాను కొత్తవలసలోని ఐజీఎం స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నట్లు, ఆమె చిన్నతనంలోనే ఆమెతల్లి ఆమెను విడిచిపెట్టి, ఎక్కడికో వెళ్లిపోయిందని,అప్పటి నుండి ఆమె తన తండ్రి వద్దనే ఉంటుందన్నారు. ఆమె తండ్రి రొంపల్లి రామకృష్ణ ఐరన్ షాపులో పనిచేస్తూ ఉంటాడని తెలియజేసిందన్నారు. 2022 వేసవిలో ఆమె తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు, సుమారు మధ్యాహ్నం 12 గం సమయంలో సొంత కూతురయిన తనపై లైంగిక దాడి చేసినాడని, అయితే తనతల్లి కూడా లేదని, ఆమెను చూసుకునే వ్యక్తి తానేనని ఎవరికీ చెప్పవద్దని తండ్రి బెదిరించసాగాడని తెలిపారు.అందువలన సదరు విషయం భయంతో ఎవరికి చెప్పలేదని, వారంరోజులు తరువాత ఆమె పుట్టినరోజు సందర్బంగా ఆరోజు ఆమె తండ్రి కేక్ తీసుకురాగా, ఆమెతన స్నేహితురాలును (బాధితురాలు-2 ) వారి ఇంటికి తీసుకువెళ్లింది. మరుసటి రోజు ఆమె స్నేహితురాలు (బాధితురాలు-2 ) తన సోదరితో కలిసి వారి ఇంటికి వచ్చి కాసేపు ఆడుకున్న తరువాత సుమారు 1.00 గంట సమయంలో వారు పక్కపక్కనే నిద్రిస్తుండగా, ఆమెతండ్రి వారి వద్దకు వచ్చి బాధితురాలు-2 పై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు.ఇదే విషయాన్ని ఆమె స్నేహితురాలు బాధితురాలు-2 తన తండ్రిని ప్రశ్నించగా, ఎవరికీ చెప్పవద్దని, అలా చేస్తే కొడతానని బెదిరించాడని తెలిపారు.అందుకు ఆమె ప్రతిఘటించగా, ఆమెను కొట్టినాడని,అంతట భాదితురాళ్ళపై జరిగిన దుశ్చర్యలకు పాల్పడిన ముద్దాయి అయిన రొంపల్లి రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని బాధిత బాలికలు ఇచ్చిన ఫిర్యాదులపై పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారన్నారు.
మహిళలపై , చిన్నారులపై జరుగుతున్న నేరాలు అరికట్టడానికి చట్టపరమైన చర్యులు తీసుకోవడానికి పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.ఈకేసువిచారణలో ప్రత్యేక చొరవ చూపిన పోలీస్ సిబ్బంది వెంకట రమణ, అప్పలరాజు,సహి,హరికృష్ణ, రాధలను జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ , అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్,దిశ డి.ఎస్పీ హర్షితలు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img