శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణములో శాంతి భద్రతలపై ప్రత్యేక చొరువను చూపాలని, పోలీస్ శాఖ పై ప్రజలకు మంచి నమ్మకాన్ని కలిగించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ తో పాటు ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం వివిధ రికార్డులను, ఫైల్స్ లను వారు పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలిక కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేయాలని, కేసులు యొక్క ప్రగతి నమోదును ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలన్నారు. ఫ్యాక్షనిస్టు, మట్కా గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘాలు ఉంచాలన్నారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారున్ని సమస్యను అడిగి, పరిష్కరించే దిశలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల తనిఖీలు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగిన త్వరితగతిన కేసులు నమోదు చేస్తూ, టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజా, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.