- గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప
విశాలాంధ్ర-గుంతకల్లు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రకాల నేరాల నేపథ్యములో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంతకల్లు డియస్పీ నరసింగప్ప, గుంతకల్ రైల్వే డియస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఆర్పీయఫ్, జీఆర్ పీ, గుంతకల్ సివిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు మరియు డాగ్ స్క్వాడ్ కలసి సంయుక్తంగా గుంతకల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో అనుమానితుల పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.అందులో భాగంగా నేరాలు చేసి తల దాచుకోవడానికి అనువుగా ఉన్న రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అనుమానితులను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేశారు.అంతేకాకుండా రైళ్లలో దొంగతనాలు మరియు అక్రమంగా మాధకద్రవ్యాలును సరఫరా చేసే నేరస్థులు మరియు అనుమానితుల పై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేశారు.ఈ కార్యక్రమంలో గుంతకల్ వన్ టౌన్ సీఐ రామసుబ్బయ్య, టూ టౌన్ సీఐ గణేష్, ఆర్పిఎఫ్ ఎస్ బి ఐ ఇన్స్పెక్టర్ బెన్నయ్య ,యస్సై లు సురేష్, విజయ్ కుమార్ స్పెషల్ పార్టీ సిబ్బంది మరియ డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.