విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని మోటు మర్ల గ్రామములో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయము నందు 2024 మార్చిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థినీలకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ బుక్స్లను యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ సెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు రమావత్ రామకృష్ణ నాయక్, యోగా అసోసియేషన్ అధ్యక్షులు గొర్ల నారాయణరెడ్డి చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ మోడల్ పేపర్స్ విద్యార్థినీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంచి మార్కులతో పాఠశాలకు మంచి పేరు తీసుకొని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమం స్వర్గీయ చెన్న భారతి జ్ఞాపకార్థం ఆమె తల్లిదండ్రులు త్యాగరాజు, భారతి సహకరించడం నిజంగా అభినందనీయమని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం ఎస్ఓ. చంద్రకళ, ఉపాధ్యాయినీలు, పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.