ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం వారు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని సోమవారం ఇంచార్జ్ ఆర్డీవో కతిజున్ కుప్ర కు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, ఎస్సీ జన సంఘ విద్యార్థి విభాగం నాయకులు ప్రదీప్, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు కేశగాల వెంకటేష్ లు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలను ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారు పాటించకుండా ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ చేస్తున్నారని వారు మండిపడ్డారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో నేడు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని బాధను వ్యక్తం చేశారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడమే కాకుండా, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని? వారు ప్రశ్నించారు. కావున వారిపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ నిబంధనలు పాటించని పాటశాలలపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారాన్ని తప్పనిసరిగా తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా, నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం సరి అయిన పద్ధతి కాదని వారు తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల వద్ద ముట్టడి కు పిలుపునిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు జయవర్ధన్, సాయికిరణ్, పురుషోత్తం, యాసీన్, మురళి, విజయ్ కుమార్, రాజేష్, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.