విద్యార్థి యువజన ప్రజా రాజకీయ పార్టీ నాయకులు.
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని విద్యార్థి యువజన ప్రజా రాజకీయ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ప్రెస్ క్లబ్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య అధ్యక్షత వహించడం జరిగింది. ఈసందర్భంగా ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఎం పట్టణ కార్యదర్శి నాగార్జున, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జే వి రమణ, సిఐటియు పట్టణ నాయకులు అయూబ్ ఖాన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజా , ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కేసగాళ్ల వెంకటేష్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ చౌదరి, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు వెంకీ, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇర్షాద్, లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు ఏమాత్రం కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, మరి జీవోస్ పాటించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా రణి తెలిపారు. పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు విద్యను అందని ద్రాక్షలా మార్చేశారనీ ,ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు బోధించాల్సిన ఉపాధ్యాయుల అర్హత జాబితా పాఠశాల యొక్క నోటీసు బోర్డులో అమర్చి ఉండరు అని తెలిపారు. కాబట్టి ధర్మవరం పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విద్యార్థి యువజన సంఘాలుగా ఎన్నోసార్లు విన్నవించుకున్న గాని అధికారులు పట్టించుకోని పాపన పోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అధికారుల ద్వారా చలన మయ్యేంతవరకు ఇప్పటినుండి ఐక్య విద్యార్థి సంఘాలుగా ప్రజా పార్టీలుగా ఆందోళన దిగుతున్నామని హెచ్చరించారు. కాబట్టి ఈ యొక్క ఉద్యమానికి విద్యార్థులు, రాజకీయ, యువజన, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు శివ, పట్టణ నాయకులు సాయి కిరణ్, మనోజ్, జైపాల్, కుళాయి స్వామి, యాసీన్, త్రివిక్రమ్, విజయ్, వంశీ, టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు తిరుమలేష్, బిల్లే రామకృష్ణ, ఎస్సీ జన సంఘ విద్యార్థి నాయకులుకళ్యాణ్, ఓబులపతి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.