Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాల్లో విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు

అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాల్లో విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి హెచ్చరించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటశివారెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని..ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మండలాల్లోని పలు సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక నిఘా వేశామన్నారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్, హిస్టరీషీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. డివిజన్ అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఈ ఉత్తర్వులు ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు. అమలులో ఉన్న 30 పోలీసు యాక్టు ప్రకారం పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదని… విజయోత్సవ ర్యాలీలు చేపట్టరాదన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం బాణసంచా నిల్వ ఉంచడం, క్రయ విక్రయాలు చేయడం, కాల్చడం నిషేధమన్నారు. హోటళ్లు, దుకాణాలు మూసివేయాలన్నారు. కౌంటింగు తర్వాత కూడా అన్ని వర్గాల ప్రజలు సంయమనం కోల్పోకుండా శాంతియుతంగా మెలగాలన్నారు. కౌంటింగ్ వేళ అపరిచితులు, అనుమానితులు లేకుండా తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. డివిజన్ పరిధిలో కౌంటింగు ముగిసే వరకు 144 సెక్షన్ ఉత్తర్వులను గట్టిగా అమలు చేస్తామని, నలుగురి కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడకూడదన్నారు. గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ
సంయమనంతో ఉండాలని చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడు కానీ, తర్వాత గానీ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదన్నారు. ఒక నియోజకవర్గంలో వారు ఇంకో నియోజకవర్గంలోకి నేడు ఇలాంటి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టరాదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img