విశాలాంధ్ర-తాడిపత్రి: నా జీవితంలో మరిచిపోలేని రోజు అని 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున తన మనసులోని మాటను గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న మా కళాశాలలో నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో 30 సెకండ్లు మాట్లాడడానికి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేల మంది విద్యార్థులలో నా ఒక్కడికే మాట్లాడడానికి అవకాశం రావడానికి గల కారణం ఒకే ఒక్క మాట సార్ నేను లా విద్యార్థిని, తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ ను అని ఒకే ఒక్క మాట అన్నాను. నాతో మాట్లాడి నీలాంటి చదువుకున్న వాళ్లే రాజకీయాల్లోకి రావాలని చెప్పి నాతో ఫోటో తీసుకో న్నారు. అది కేవలం నేనంటే ఒక గుర్తింపుగా విద్యార్థి కాకుండా ఒక ప్రజా ప్రతినిధిగా తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ గా ఉండడమే ఇంతటి అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశం రావడానికి గల కారణం గౌరవనీయులు జేసీ. ప్రభాకర్ రెడ్డి ఆయన కేవలం నన్ను ఒక కౌన్సిలర్ గా గుర్తించ బట్టే ఈరోజు గవర్నర్ వద్ద గుర్తింపబడ్డాను. ఇంతటి అవకాశం గుర్తింపు ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను.