డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : వృత్తి నందు నిబద్ధత, సామాజిక సృహ కలిగిన వ్యక్తి ఈ ఈ, ఏ పి ఎస్ పి డి సి ఎల్ కోమలపాటి సుధాకర్ బాబు అని డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం:పి టి సి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పి టీ సి స్టేడియం నందు వాకర్స్ సభ్యులు మరియు ఆత్మీయ మిత్రులు పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్కేయూ మాజీ రిజిస్టర్ సుధాకర్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ శ్రీ కోగటం విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్ర శేఖరరెడ్డి ముఖ్య వక్తగా వ్యవహరినించి సభ్యులు మాజీ ఏపీపీ నాగలింగం, ఆర్ ఐ ఓ రమణ, ఏపీజీబీ మేనేజర్ అశ్వార్తు, మాజీ టౌన్ బ్యాంక్ మేనేజర్ లోకనాథ్, మాజీ టౌన్ బ్యాంక్ మేనేజర్ రాయల్ మురళి మోహన్, రిలాక్స్ నాగరాజువైస్సార్ నాయకులు, రాజు, కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోట్ల రవి, సీనియర్ కాంట్రాక్టర్ కే వెంకట సాయికుమార్, ఇందిరా ప్రియదర్శిని హోటల్ ధనుంజయ బాబు తదితరులు సుధాకర్ బాబు విది నిర్వహనలో తన బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక సేవ భాగంలో పి టి సి స్టేడియం నిర్వహణలో సభ్యులకు వాకింగ్ కి సౌకర్యలు కల్పించడంలో మరియు ఆఫీసర్స్ క్లబ్ నందు గత ఆరు సంవత్సరాలుగా ప్రతిరోజు అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించేవారు అన్నారు. పదవి విరమణ అనేది వయసుకు సంబంధించిందే కానీ మనసుకు కాదని తను మరింత సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ అందరి వాడిలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.