విశాలాంధ్ర -ఉరవకొండ : కొత్త ఓటర్లు నమోదు, మార్పులు, చేర్పులు ఓటర్ ఐడెంటి కార్డుకు ఆధార్ అనుసంధానం తదితర అనేక అంశాలపై బూత్ లెవెల్ అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం ఉరవకొండ తాసిల్దార్ బి. ఈరమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూత్ లెవెల్ సిబ్బంది ఎన్నికల సంఘం యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు ఆగస్టు నెల 21 వరకు జరిగే ఈ సర్వే కార్యక్రమంలో బిఎల్వోలుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈడిటి మునీంద్ర, సీనియర్ సహాయకులు సాయి కృష్ణవంశీ బిఎల్వో లు పాల్గొన్నారు.