టెండర్లలో ఎలాంటి తప్పులు జరగలేదు
పెన్నహోబిలం ఆలయ ఈవో విజయ్ కుమార్
విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండలం పెన్నహోబిలం ఆలయం ఆవరణలో ఆలయానికి సంబంధించిన ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ఈనెల 18వ తేదీన నిర్వహించిన బహిరంగ టెండర్లలో ఎలాంటి అవకతవకలు, తప్పులు కానీ జరగలేదని ఆలయ ఈవో విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తలనీలాలు, మరియు టెంకాయలు అమ్ముకునే హక్కు టెండర్లను పుల్లయ్య అనే వ్యక్తి హెచ్చు పాటు ద్వారా దక్కించుకున్నారని గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో ఆదాయం రావడం జరిగిందని అయితే పుల్లయ్య అనే వ్యక్తి టెండర్లలో పాడిన పాటకు సంబంధించిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని ఆలయానికి చెల్లించడం జరిగిందని అందుకే టెండర్లను ఆమోదించడం జరిగిందని ఆయన తెలిపారు. 50% మొత్తాన్ని చెల్లించడానికి నిబంధనల మేరకే తాత్కాలిక గడువు ఇవ్వడం జరిగిందని అంతే తప్ప టెండర్లలో తప్పు జరగలేదన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన మొత్తం అంశాలను దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు కూడా నివేదించడం జరిగిందన్నారు. పుల్లయ్య అనే వ్యక్తి తలనీలాలను రూ,5205000 లక్షలకు దక్కించుకొని అందులో రూ,26,02500 లక్షలు ఆలయానికి చెల్లించారన్నారు. అంతేకాకుండా టెంకాయలు అమ్ముకునే హక్కు కూడా రూ, 23,30000 కు ఆయనే దక్కించుకుని లక్ష రూపాయలు చెల్లించడం జరిగిందని ఆలయ ఈవో తెలిపారు. టెండర్లను రద్దు చేసి తిరిగి టెండర్లు నిర్వహిస్తే ఇంత ఆదాయం రాకపోతే నష్టపోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.