ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు కళాశాల ఫీజుకు సంబంధం లేకుండా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని లేదని అటువంటి కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య నియోజకవర్గ అధ్యక్షులు శివ సోమవారం ఆర్డిఓ కార్యాలయంలోని డీఏవో కతిజున్ కుప్రా కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు కళాశాల ఫీజు కడితేనే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తామని ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారు అని, ఇది ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న విద్యా వసతి దీవెన రెండు విడతలు విడుచగా ఈ ఎగ్జామ్స్ సెమిస్టర్ రాయడానికి విద్యార్థులకు మరొక రెండు విడుదల చేయనుండగా ఆ యొక్క వసతి దీవెన విడుచకపోగా, విద్యార్థులే స్వయాన తమ సొంత డబ్బుల్ని కళాశాల కడితేనే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులను ఒత్తిడికి గురి చేసి ఫీజులు కట్టించుకొనుటకు విద్యార్థులను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి తక్షణమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల కు చర్యలు తీసుకొని విద్యార్థులకు కళాశాల సంబంధం లేకుండా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కోరుచున్నాముఅని తెలియజేసారు ఈ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు జి.సాయికిరణ్, ఎన్.రవికుమార్, బి. నందగోపాల్, ఎ.విష్ణు, డి.హాసిక్, ఎస్.చందుతదితరులు పాల్గొన్నారు.