విశాలాంధ్ర- పెనుకొండ : నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జ్ బికె.పార్థసారథి పాల్గొని ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, బూత్, యూనిట్, క్లస్టర్ ఇంచార్జిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ కష్టపడి పని చేయాలని జగన్ వైఫల్యాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని గ్రామస్థాయిలో అత్యంత కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలని జగన్ దొంగ ఓట్లు చేర్చి గెలవాలని చూస్తున్నాడని కనుక అందరూ ఫీల్డ్ వర్క్ తో పాటు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ గోరంట్ల కన్వీనర్లు సోమశేఖర్, సోమందేపల్లి కన్వీనర్ సిద్దలింగప్ప, ట్రైనర్లు నరేష్ యాదవ్, నవీన్ కుమార్, హరిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.