విశాలాంధ్ర -ధర్మవరం : ప్రజల సమస్యల పరిష్కారమే జగనన్న సురక్ష కార్యక్రమము యొక్క ముఖ్య లక్ష్యము అని సర్పంచ్ నందిని, ఉపసర్పంచ్ మంజునాథరెడ్డి,ఎంపిటిసి చెన్న కృష్ణమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని గొట్లూరు-2 సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో సౌజన్య కుమారి, డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్యలు జగనన్న సురక్ష కార్యక్రమము యొక్క ప్రాధాన్యతను, వాటివల్ల ఉపయోగాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 11 రకాల సర్వీసులను గూర్చి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈరోజు 3,195 సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటివరకు గ్రామపంచాయతీలో 3,191 సర్వీసులను పూర్తి చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మురళి తో పాటు సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.