అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ్ శర్మ
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ కాశీ విశాలాక్షి సహిత విశ్వనాథ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శివమాల ధారణ వేసిన భక్తాదులకు దాతల సహాయ సహకారములతో అన్నసంతర్పణ నిర్వహించడం దైవ శుభదాయక ఆశీస్సులు అని పురోహితులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ద్వారకనాథ్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో ప్రతిరోజు శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివ భజనలు అనంతరం మాల ధారణ వేసిన 400 మంది కు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. తొలుత దాతల పేరిటన ప్రత్యేక పూజలు అర్చనలు కూడా నిర్వహించామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం మా ఆలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని ఇటువంటి మాల ధారణ భక్తాదులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని దాతలే నిర్వహించడం భగవంతుని సేవా కార్యక్రమం అవుతుందని తెలిపారు. మారాధారణ భక్తాదులు మాట్లాడుతూ మా అన్న సందర్భంగా పురోహితులతో పాటు దాతలు కూడా మా దీక్షలకు సహాయ సహకారాలను అందించడం మాకు ఎంతగానో సంతోషంగా ఉందని తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.