ఐ.ఎఫ్.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు పి. ప్రసాద్
విశాలాంధ్ర-గుంతకల్లు : బిజెపి ప్రభుత్వం ఫాసిస్టు విధానాలు అవలంబిస్తూ,మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభేదాల సృష్టిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఐ.ఎఫ్.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు పి. ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం గుంతకల్లు గాయత్రీ ఫంక్షన్ హాల్ (రామ కృష్ణారెడ్డి నగర్) లో ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర వర్క్ షాప్ రాజకీయ తరగతులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. వెంకటేశ్వర్లు, జే. వెంకటేశ్వర్లు, ఆర్. హరికృష్ణ ల అధ్యక్షతన ఈ సభలో ప్రసాద్ మాట్లాడుతూ..యూనిఫామ్ సివిల్ కోడ్, మణిపూర్ ఘటనలు ఫాసిస్టు విధానాలకు ప్రధాన ఉదాహరణలని వివరించారు.అనంతరం ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పాలారి రాష్ట్ర కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యులు బి. సురేష్, నాయకులు చిన్నా తదితరులు సభ ప్రారంభానికి ముందు ఇఫ్టూ జెండాను ఎగరవేసి, అమరవీరులకు నివాళి అర్పించారు.అరుణోదయ కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.