Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యువతకు భవిష్యత్తు కనబడుతోంది…కందికుంట

కార్మికుల కర్షకుల హక్కులు నిర్వీర్యం….పవన్ కుమార్ రెడ్డి
దళితుల పైన దౌర్జన్యాలతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు…… Sc సెల్ రాజశేఖర్ బాబు
పలువురు యువకులు, వైసీపీ నుండి టిడిపిలో చేరిక

విశాలాంధ్ర -తనకల్లు ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల విసుగు చెందిన యువకులు తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా చంద్రబాబుకే ఉందనే నమ్మకంతో వైసీపీ నుండి పెద్ద ఎత్తున యువకులు తెలుగుదేశం పార్టీలో గురువారం కందికుంట సమక్షంలో చేరారు. మండల పరిధిలోని పరాకువాండ్ల పల్లి కి చెందిన యువతతో పాటు బిజెపి మండల కన్వీనర్ రెడ్డప్ప రెడ్డి నాగిరెడ్డి ముస్లిం యువకులు టిడిపి మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన కందికుంట వెంకటప్రసాద్ కు వాల్మీకి విద్యాసంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డికి పార్టీ శ్రేణులు ప్రజలు డప్పులతో పూలతో బాణ సంచాలతోహారతులతో ఘన స్వాగతం పలికారు. చేరికల అనంతరం ఏర్పాటు చేసిన సభలో కందికుంట మాట్లాడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో విసిగి వేసారిన యువకులు ముందు చూపుతో వ్యవహరించడం సంతోషించదగ్గ విషయం అన్నారు రానున్న ఎన్నికల్లో ఏ విషయంపై కూడా అలసత్వం వహించరాదరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు అసంతృప్తితో ఎదురుచూస్తున్నానటంలో సందేహం లేదని వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్త ఒక సైనికుడై పని చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.ఈ ప్రభుత్వంలో కార్మికులకు కర్షకులకు రక్షణ కరువై వారి హక్కుల తో పాటు వారికి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని ఆ నిధులను పక్కదారి మళ్ళించి కార్మికులకు మొండి చేయి చూపించిందని వాల్మీకి విద్యాసంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి దిశా నిర్దేశం యువకులకు ప్రాధాన్యత కార్మికులకు రక్షణ ఇలా ఎన్నో కార్యక్రమాలను ఆలోచించి రచించి ప్రవేశపెట్టి వాటిని అమలుపరిచే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు కే ఉందని అప్పుల ఊపులో కూరుకుపోయిన రాష్ట్రానికి 2024 లో ఆయనను ముఖ్యమంత్రిని చేసుకొని కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించుకుని ప్రభుత్వంలో కదిరిని భాగస్వామ్ని చేసుకుని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పవన్ కుమార్ రెడ్డి సూచించారు.దళితులపై చిన్న చూపుతో పాటు దళితులను హత్యగావించడంలో దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడంలో వైసీపీ ప్రభుత్వం రాటుతేలిందని ఈ ప్రభుత్వానికి దళితులంతా బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని ప్రతి దళితుడు రాష్ట్రంలో దళితులపై జరిగిన అన్యాయాలను మరవకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లతోపాటు దళితులు ఉన్నత స్థానాలకు చేరుకునే మార్గాన్ని మనమే రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్సీ సెల్ నాయకుడు రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. కదిరి నియోజకవర్గంలో కష్టమొచ్చిన ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే గడప కందికుంట వెంకటప్రసాద్ గడపేనని గత 20 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులతో పాటు అందరికీ సూపరిచితుడైన కందికుంట వెంకట ప్రసాద్ ను టిడిపి జనసేన శ్రేణులతో పాటు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రయాణం చేయాలని బాలసముద్రం జనసేన ఎంపిటిసి అమర కార్తికేయ జనసేన మండల కన్వీనర్ రమణలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మాజీ కన్వీనర్ బీగం శంకర్ నాయుడు సీనియర్ నాయకులు దేశాయ్ వెదురు శేఖర్ రెడ్డి దేశాయ్ ప్రభాకర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రాజారెడ్డి మునెప్ప పీజీ మల్లికార్జున దస్తగిరి మహబూబ్ బాషా జియావుల్లా శ్రీరాముల నాయక్ మాజీ ఎంపిటిసి బాలప్ప ఓబులేసు ఎస్సీ సెల్ చిన్నప్ప చంద్రప్ప మంజు నాగేంద్ర నగేష్ తోబాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img