జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎన్జీవో సమావేశ మందిరములో ధర్మవరం వ్యవసాయ డివిజన్లోని బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం, కనగానపల్లి, సికేపల్లి, రామగిరి మండల రైతు భరోసా సిబ్బంది, వ్యవసాయ ఉద్యాన పట్టు సహాయకులకు మద్దతు ధరకు కందులు కొనుగోలు పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, సహాయ వ్యవసాయ సంచాలకులు- ధర్మవరం- కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు కందులు కొనుగోలు యాప్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా మద్దతు ధర క్వింటాలకు రూ.7,000గా నిర్ణయించడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి కందుల కొనుగోలు యాప్ గురించి అశ్వత్థ నారాయణ నాయక్ వివరించారు. సంచులు నింపడానికి అయ్యే కూలి ఖర్చులు రవాణా ఖర్చులు, ప్రభుత్వమే భరిస్తుందని వారు తెలిపారు. రైతు సొంతంగా రవాణా చేసుకుంటే రవాణా ఖర్చులు తిరిగి రైతుకు చెల్లించడం జరుగుతుందని వారు తెలియజేశారు. పంటల విషయంపై మరిన్ని వివరాలను కూడా వివరించడం జరిగిందని వారు తెలిపారు. రైతు భరోసా సిబ్బంది రైతుల యొక్క పంటల వివరాలను తెలుసుకోవడం, అధిక దిగుబడి వచ్చే విధంగా సహాయ సహకారాలు, తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ సివిల్ సప్లై అశ్వర్థ నారాయణ నాయక్, డి ఎం, మార్క్ఫిడ్ గీత, వ్యవసాయ డివిజన్ మండల వ్యవసాయ అధికారులు రమాదేవి, ఓబిరెడ్డి ,ముస్తఫా, ఉదయ్ కుమార్, మురళి, కృష్ణకుమారి, రైతు భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.