విశాలాంధ్ర – ధర్మవరం : జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇంటింటా సర్వే ద్వారా ప్రజలకు కావలసిన సేవలను గుర్తించి, అర్హత గల వారిని పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని ప్రత్యేక అధికారి జాన్ బాషా, ఎంపీడీవో సౌజన్య కుమారి, విస్తరణాధికారి మమతా దేవి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సీసీ. కొత్తకోట సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం పోతుల నాగేపల్లి సర్పంచ్ మౌనిక రెడ్డి,సీసీ కొత్త కోట గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అధికారి చాంద్ బాషా ఎంపీడీవో సౌజన్యకుమారి మాట్లాడుతూ గత ఏడు రోజుల నుండి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 11 రకాల సర్వీసులు గూర్చి వివరించడం జరిగిందని, తదుపరి అర్జీలను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు1350 సర్వీసులను పూర్తి చేయడం జరిగిందన్నారు. షెడ్యూల్ తేదీల ప్రకారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.