విశాలాంధ్ర – ధర్మవరం : రూరల్ పరిధిలోని చిగిచెర్ల- కందుకూర్ గ్రామాల మధ్య టు వీలర్ లో ప్రయాణిస్తున్న ఓ.దుర్గా ప్రసాద్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మృతుడు దుర్గాప్రసాద్ పట్టణములోని లోని కోటకు చెందిన వ్యక్తిగా గుర్తించామని, ఇతను నిన్నటి రాత్రి దాదులూరు పరుష నిమిత్తం అనంతపురంలో ఉండే బంధువుల ఇంటి వద్దకు వెళ్లేందుకు ధర్మారం నుండి వయా చిగిచెర్ల మీదుగా అనంతపురంకు బయలుదేరడం జరిగిందన్నారు. అతివేగంతో టూ వీలర్ లో ప్రయాణిస్తూ అదుపుతప్పి చిగిచెర్ల-కందుకూరు గ్రామాల మధ్యలో ఓ గుంతలో పడి అనంతరం చెక్ డాం వద్ద గల సిమెంట్ దిమ్మకు తల తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. తదుపరి బంధువులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. మృతుడు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించే వారిని, మృతుడు అవివాహితుడు అని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.