Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : భారత కమ్యూనిస్ట్ పార్టీ మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, అమిత్ షాహ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు . శనివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీ పార్టీ మరల అధికారం లోకి వస్తె ముస్లిం మైనార్టీలకు ఉన్న 4% రిజర్వేషన్ ను తీసివెస్తామని ప్రకటించటం దారుణమని చెప్పారు. ఇలాంటి విద్వేషపూరిత పార్టీలను భారత దేశ ప్రజలు బిజెపి పార్టీని నమ్మకూడదన్నారు. ఏ ప్రభుత్వమైనా , పేదరిక నిర్మూలన , మౌలిక సదుపాయాలు , యువతకు ఉద్యోగ అవకాశాలు , యూనివర్సిటీలు, ఆరోగ్యం,రైతులకు న్యాయం, విద్యా వ్యవస్థను పెంపొందించడం , వాటి గురించి పాటు పడితే దేశం ఉన్నత స్థాయికి వెళ్తుందన్నారు. ప్రపంచం లోనే మన భారత దేశం ఒక సూపర్ పవర్ అని కొనియాడుతున్నారు. ఇలాంటి అనవసర మత పరమైన నిర్ణయాలు , ఆమోదాలు, దేశానికి ఎనలేని ముప్పు అని వివరించారు . వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఓటు వెయ్యకూడదు అని కోరారు . వైఎస్సార్సీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీ కు పరోక్షంగా సమర్థించే పార్టీనే , ఎందుకంటే 2019లో CAA బిల్లుకు తమ ఆమోదం తెలిపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో సెక్యులర్ పార్టిలైనటువంటి కాంగ్రెస్, సీపీఐ, సిపిఎం పార్టీలు ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు . ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు అల్లి పీర , అధ్యక్షులు చాంద్ బాషా , ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ , నాయకులు రజాక్ , మున్నా, ఖాదర్ వలీ, దాదు,మొహిద్దిన్, హాజీ వలీ తదితరులు పాల్గొన్నారు ..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img