విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండలో గురువారము వైయస్సార్సీపి కార్యలయం ప్రారంబం కార్యక్రమానికి నియోజక వర్గం నలుమూలల నుంచి కౌన్సిలర్లు ,సర్పంచులు, మాజీ సర్పంచ్లు, మాజీ మండల కన్వీనర్లు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్,వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానే కుటుంభం అబిమానులు ముఖ్యంగా యువత ఎక్కువగా హాజరు అయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఉమారాణి ప్రేమతో పలకరించడంతో మరొసారి సానే చెన్నారెడ్డి, రమణా రెడ్డి గుర్తుకు వచ్చారనీ వచ్చిన కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. దీనితో ఉమారాణి నియోజక వర్గం కార్యకర్తలను ఉద్దేశిస్తూ మా కుటుంభం మీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు,కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి ఇక మీదట నేను పెనుకొండలోనే ఉంటానని ప్రతి కార్యకర్త సమస్య తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తాను అని, ఎల్లపుడు అందుబాటులో ఉంటానని, అధిష్టానం ఆదేశిస్తే పెనుకొండలో పోటీ చేసి అందరి సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలిచి పెనుకొండ అభివృద్ధికి మరింత కృషిచేస్తానని తెలిచేసారు. దీనితో అక్కడకు వచ్చిన కార్యకర్తలు ఇలాంటి నాయకురాలి దిశా నిర్దేశం లో పనీచేయడానికి మాకు చాలా గర్వంగా ఉంది అని,జగన్ అన్న ఆశయాలను ప్రజలలోకి తీసుకుని వెళ్ళే శక్తి సామర్థ్యాలు ఉమారాణికి పుష్కలంగా ఉన్నాయి అని కొనియాడారు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ర్యాలీగా వెళ్లి
సానే ఉమారాణి నాయకత్వం వర్ధిల్లాలినీ వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.