Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో మహిళా పోలీసులు కీలక పాత్ర వహించాలి

డి.ఎస్.పి శ్రీనివాసులు

విశాలాంధ్ర – ధర్మవరం : వచ్చే సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో మహిళా పోలీసులు కీలకపాత్ర వహించాలని డిఎస్పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని గాంధీ నగర్ లో గల మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణమండపంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ధర్మవరం సబ్ డివిజన్లోని సచివాలయ మహిళా పోలీసులకు వర్క్ షాపు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, దిశా డి.ఎస్.పి శ్రీనివాసులు, దిశా డిఎస్పి విక్రమ్ పాల్గొన్నారు. అనంతరం డిఎస్పి శ్రీనివాసులతోపాటు దిశా డిఎస్పీలు, ఆర్డీవో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలు సజావుగా విజయవంతంగా నడవాలి అంటే మహిళా పోలీసులు తమ విధులను బాధ్యతతో కూడిన విధంగా పనిచేయాలని తెలిపారు. ప్రతి మహిళా పోలీస్ నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినప్పుడే ఎన్నికలు విజయవంతం అవుతాయని తెలిపారు. మహిళా పోలీసులు తమకు సంబంధించినటువంటి వార్డులు, గ్రామాలలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరిగిన, ఏవైనా చిన్నపాటి గొడవలకు ఆస్కారం ఉన్న, వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తప్పక చేరవేయాలని తెలిపారు. చిన్నపాటి సమస్యలే ఎన్నికల్లో రాజకీయ గొడవలకు దారితీస్తాయి అన్న విషయాన్ని అందరూ తప్పక గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. అలాంటి ఘటనను ముందుగానే మహిళా పోలీసులు గుర్తించాలని తెలిపారు. ఏ పార్టీ వారైనా ప్రలోభాలకు గురిచేసిన వారిపై సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అందరి సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఉన్నతాధికారులు సూచించిన వాటిని తప్పకుండా పాటించి ఎన్నికల నిర్వహణలో సక్రమంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి పొరపాటు జరిగిన ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే వారిపైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, టూ టౌన్ సిఐ అశోక్ కుమార్, ధర్మవరం రూరల్ ఎస్సై నరేందర్, టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, బత్తలపల్లి ఎస్సై శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని ఎస్సైలు, సిఐలు, పోలీస్ సిబ్బంది, వార్డు, గ్రామాల సచివాలయాల మహిళా పోలీసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img